epaper
Sunday, February 1, 2026
spot_img
epaper

‘వికసిత్​ భారత్​’ లక్ష్యాన్ని నెరవేర్చే బడ్జెట్​: ప్రధాని మోదీ

కలం, వెబ్​డెస్క్​: వికసిత్​ భారత్​’ (Viksit Bharat) లక్ష్యం దిశగా, దేశ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చేలా కేంద్ర బడ్జెట్​ ‌ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. పార్లమెంట్​లో ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రవేశపెట్టిన 2026‌‌–27 బడ్జెట్​పై ప్రధాని స్పందించారు. ఈ బడ్జెట్​ 140కోట్ల భారతీయుల ఆకాంక్షలకు ప్రతిబింబిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ బడ్జెట్​ దేశంలో సంస్కరణల ప్రయాణాన్ని బలోపేతం చేస్తుందన్నారు. మూడో ఆర్థిక శక్తిగా అవతరించేందుకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఇది ‘వికసిత్​ భారత్​’ లక్ష్యాన్ని నెరవేర్చే బడ్జెట్ అని ప్రధాని పేర్కొన్నారు.​

మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్​ పెద్దపీట వేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) చెప్పారు. హైస్పీడ్ రైలు​​ కారిడార్ల ఏర్పాటుకు ప్రోత్సాహం ఇస్తుందన్నారు. స్వదేశీ తయారీకి రూపొందించిన ‘ఆత్మ నిర్బర్​’కు ఊతమిచ్చేలా​ ఉందని చెప్పారు. చరిత్రాత్మక బడ్జెట్​ ప్రవేశపెట్టినందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు.

Read Also: సిట్ విచారణ.. కేసీఆర్ భావోద్వేగం..!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>