కలం, వెబ్డెస్క్: ఉత్తరప్రదేశ్లోని మీరట్ (Meerut)లో కన్వరియాలు (Kanwariyas) రెచ్చిపోయారు. ఓ యాక్సిడెంట్ విషయమై ఏకంగా పోలీసులపైనే ఘోరంగా దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గంగాజలంతో వెళ్తున్న కన్వరియాలను ఓ బైకర్ ఢీకొట్టి పరారయ్యాడు. ఈ వివాదాన్ని సర్దుబాటు చేసేందుకు కొందరు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ క్రమంలో బైకర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెంటనే కన్వరియాలు పోలీసులపై విరుచుకుపడ్డారు. బైకర్ పారిపోవడానికి పోలీసులే కారణమంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల బట్టలు చించి, కర్రలతో దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

