కలం, వెబ్డెస్క్: భారత సంతతి అధికారి ఒకరు (Madhu Gottumukkala) అమెరికా ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేశారు. యూఎస్ ప్రభుత్వానికి చెందిన కీలక సమాచారం ఉన్న ఫైల్స్ను చాట్జీపీటీలో అప్లోడ్ చేశారు. దీంతో ఈ విషయం సంచలనం సృష్టిస్తోంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహాయ బృందంలో భారత సంతతి వ్యక్తి, ఆంధ్రప్రదేశ్కు చెందిన మధు గొట్టుముక్కల (Madhu Gottumukkala) పనిచేస్తున్నారు. ఈయన గత మేలో అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్(డీహెచ్ఎస్) కు చెందిన యూఎస్ సైబర్సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ(CISA) తాత్కాలిక డైరెక్టర్గా నియమితులయ్యారు. ఈ హోమ్ల్యాండ్ ఉద్యోగులు చాట్జీపీటీ వాడడంపై నిషేధం ఉంది. అయితే, ఏఐ చాట్బాట్ కోసం అనేక సార్లు ఒత్తిడి చేసిన మధు ఆ తర్వాత ప్రత్యేక అనుమతి తీసుకున్నారు. అనంతరం చాట్జీపీటీ పబ్లిక్ వెర్షన్లో అమెరికా ప్రభుత్వానికి చెందిన అనేక ఫైల్స్ అప్లోడ్ చేశారు. ఇందులో సీఐఎస్ఏ కాంట్రాక్టులు ఉన్న ఫైల్స్తోపాటు, అత్యంత కీలక సమాచారం కలిగినవీ ఉన్నాయి.
దీనిపై గతేడాది ఆగస్టులోనే సీఐఎస్ఏ ఇంటర్నల్ సెక్యూరిటీ సెన్సార్లు హెచ్చరికలు జారీ చేశాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం పూర్తిగా బయపడి, ఇందులో మధు గొట్టుముక్కల పాత్ర ఉన్నట్లు తేలింది. అప్లోడ్ చేసిన సమాచారం ఓపెన్ ఏఐకి చేరడంతో.. ఇందులోని ఫైల్స్కు సంబంధించిన విషయం గురించి ఎవరైనా అడిగితే సమాధానం వచ్చే ప్రమాదం ఉంది. మొత్తం తతంగంపై డీహెచ్ఎస్ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.


