కలం/ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పర్యటనకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి కావాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti) తెలిపారు.
జనవరి 18న జరుగనున్న ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్, పైలాన్ ఆవిష్కరణ, నర్సింగ్ కళాశాల వద్ద చేసిన ఏర్పాట్లను శనివారం రాత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన (Ponguleti) మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎటువంటి తప్పులు జరగకుండా ఏర్పాట్లు పూర్తి కావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటన లో డిప్యూటీ సీఎం, మంత్రులు, ఇతర వివిఐపి, వీఐపీలు పాల్గొంటారని తెలిపారు.
Read Also: హోమ్ లోన్ కట్టేశారా.. ఇలా చేస్తే బ్యాంకులే మీకు డబ్బు చెల్లిస్తాయి
Follow Us On: Instagram


