epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఎయిర్​ ఇండియా కేసులో ట్విస్ట్​.. పైలెట్​ బంధువుకు నోటీస్​ 

కలం, వెబ్​డెస్క్​: నిరుడు జూన్​లో జరిగిన ఎయిర్​ ఇండియా ఘోర ప్రమాదం (Air India Crash) కేసులో ట్విస్ట్​. ఫ్లైట్​ కెప్టెన్​​ సుమీత్​ సభర్వాల్​​ (Sumeet Sabharwal) బంధువుకు ఎయిర్​క్రాఫ్ట్​ యాక్సిడెంట్​ ఇన్వెస్టిగేషన్​ బ్యూరో(ఏఏఐబీ) నోటీస్​ పంపింది. దీనిపై పైలెట్ల సమాఖ్య.. ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియన్​ పైలెట్స్ (ఎఫ్ఐపీ) ​ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఏఏఐబీకి  లీగల్​ నోటీస్​ ఇచ్చింది. దీంతో ఈ వివాదం పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్​ నాయుడు వద్దకు చేరింది.

అసలేం  జరిగిందంటే..

గుజరాత్​లోని అహ్మదాబాద్​ నుంచి నిరుడు జూన్​ 12న లండన్​కు బయలుదేరిన ఎయిర్​ ఇండియా ఎ171 విమానం గాల్లోకి ఎగిరిన సెకండ్ల వ్యవధిలోనే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఫ్లైట్​లోని  కెప్టెన్​తో సహా​ 12 మంది సిబ్బంది, 229 మంది ప్రయాణికులు చనిపోగా, ఒక్క ప్యాసింజర్​ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అలాగే విమానం ఓ మెడికల్​ కాలేజీ హాస్టల్​పై పడడంతో 19 మంది మరణించారు. ఈ దుర్ఘటనపై (Air India Crash) ఏఏఐబీ దర్యాప్తు జరుపుతోంది.

ఇందులో భాగంగా.. ప్రమాదానికి  గురైన ఎయిర్​ ఇండియా ఫ్లైట్​ కెప్టెన్​ సుమీత్​ సభర్వాల్​ బంధువైన వరుణ్​ ఆనంద్​ను విచారణకు రమ్మంటూ నోటీస్​ జారీ చేసింది. కాగా, ఆనంద్​ సైతం పైలెట్​గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో నోటీస్ విషయం తెలిసి పైలెట్ల సమాఖ్య మండిపడింది. ఆనంద్​కు ప్రత్యక్షంగా, టెక్నికల్​గా, ఎక్స్​పర్ట్​గా.. ఏ విధంగానూ దుర్ఘటనతో సంబంధం లేదని, అలాంటప్పుడు ఎలా నోటీస్​ ఇస్తారని ప్రశ్నించింది. అంతర్జాతీయ పౌ విమానయాన సంస్థ(ఐసీఏం) నిబంధల ప్రకారం పైలెట్​ కుటుంబసభ్యులను విచారణకు పిలవడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. అవసరమైతే జూమ్​ కాల్ విచారణకు ఆనంద్​ హాజరవుతారని చెప్పింది.

కాగా ఈ కేసు విచారణలో ఇంతముందు సైతం ఏఏఐబీ తీరుపై విమర్శలు వచ్చాయి. ప్రమాదం గురించి ప్రాథమిక నివేదికలో.. కెప్టెన్​​ సుమీత్​, ఫ్లైట్​ ఫస్ట్​ ఆఫీసర్​ క్లైవ్​.​ మధ్య జరిగిన సంభాషణను ఏఏఐబీ వెల్లడించడం దీనికి కారణం. కాక్​పిట్​ ఆడియోను విశ్లేషించినప్పుడు అందులో ఒక పైలెట్​ ‘నువ్వెందుకు కట్​ చేశావ్​?’ అని ప్రశ్నించగా, మరో పైలెట్​ ‘నేను చేయలేదు’ అని జవాబిచ్చినట్లు నివేదిక పేర్కొంది.

దీంతో ఈ ప్రమాదానికి కెప్టెన్​​ తప్పిదమే కారణమని అప్పట్లో ఊహాగానాలు వచ్చాయి. దీని మీద అభ్యంతరం చెబుతూ కెప్టెన్​ సుమీత్​ సభర్వాల్​ తండ్రి ​పుష్కరాజ్​, పైలెట్ల సమాఖ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రాథమిక నివేదికపై సుప్రీం ‘దురదృష్టకరం’ అంటూ అప్పట్లో వ్యాఖ్యానించింది.

Read Also: నక్సలైట్లకు మరో ఎదురుదెబ్బ.. భారీగా లొంగుబాటు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>