epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

‘కోహ్లీ, గంభీర్ మధ్య గొడవ అదే’

కలం, స్పోర్ట్స్: టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ (Virat Kohli), ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ (Gautam Gambhir) మధ్య విబేధాలు ఉన్నాయంటూ కొంతకాలంగా మీడియాలో బాగా ప్రచారం సాగుతోంది. కానీ అసలు వారిమధ్య గొడవ ఏంటి? అనేది ఓ సస్పెన్స్‌లా మారింది. అప్పుడెప్పుడో ఐపీఎల్ సమయంలో వారి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్టు వార్తలు వినిపించాయి. ఆ తర్వాత నుంచి వారి మధ్య ఎప్పుడూ కూడా పచ్చిగడ్డి వేస్తే భగ్గు మనే వాతావరణమే ఉందంటూ ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ సస్పెన్స్‌పై తాజాగా టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ క్లారిటీ ఇచ్చారు.

విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మలతో (Rohit Sharma) హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు విభేదాలు ఉన్నాయన్న వార్తలను ఆయన ఖండించారు. ప్రస్తుతం ఈ ముగ్గురు వన్డే ఫార్మాట్‌పై నిరంతరం చర్చిస్తూ భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని చెప్పారు. రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ లక్ష్యంగా తమ అనుభవాన్ని పంచుకుంటూ కీలక పాత్ర పోషిస్తున్నారని కోటక్ తెలిపారు.

ఒక్క ఫార్మాట్‌కే పరిమితమైనా పూర్తి ప్రొఫెషనలిజంతో ఫిట్‌నెస్ ప్రాక్టీస్ వర్క్‌లోడ్‌ను సమర్థంగా నిర్వహిస్తున్నారని అన్నారు. న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో విరాట్ 93 పరుగులతో మెరిసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలవగా రోహిత్ 26 పరుగులకే అవుటయ్యాడు. ఇప్పుడు రెండో వన్డేలో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవడమే టీమ్ ఇండియా లక్ష్యమన్నారు.

Read Also: కింగ్ ఈజ్ బ్యాక్.. వన్డేల్లో మళ్లీ నెం.1

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>