epaper
Friday, January 16, 2026
spot_img
epaper

కోస్తా జిల్లాలకు ‘మొంథా’ ముప్పు ఇంకా ఉంది..

మొంథా తుఫాను(Cyclone Montha) ప్రభావం కోస్తా ప్రాంత జిల్లాలపై ఇంకా ఉండనుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్రతుపాన్‌గా మారిందని చెప్పారు. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో కదిలిందని, ప్రస్తుతానికి మచిలీపట్నంకి 120 కిమీ, కాకినాడకి 200 కిమీ, విశాఖపట్నంకి 290 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించారు. మంగళవారం రాత్రికి కాకినాడ- మచిలీపట్నం మధ్య తీవ్రతుపానుగా తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేశారు. దగ్గరకు వచ్చే కొద్దీ ప్రభావం పెరిగే అవకాశం ఉందని, తద్వారా కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవచ్చని వివరించారు. తీరందాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు.

Read Also: కోనసీమలో ‘మొంథా’ బీభత్సం..

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>