కలం, వెబ్డెస్క్: టాటా స్టీల్ చెస్ (Tata Steel Chess) ఇండియా బ్లిట్జ్ చెస్ టోర్నీలో భారత్కు నిరాశ. ఓపెన్ కేటగిరిలో ఆదివారం జరిగిన పురుషుల, మహిళల విభాగంలో మన క్రీడాకారులు రన్నరప్తో సరిపెట్టుకున్నారు. ఈ రెండు విభాగాల్లోనూ అమెరికా క్రీడాకారులు టైటిల్స్ నెగ్గారు. పురుషుల విభాగం ఓపెన్ కేటగిరీలో అమెరికన్ గ్రాండ్ మాస్టర్ వెస్లీ సో 12 పాయింట్లతో విజేతగా నిలిచాడు. భారత గ్రాండ్మాస్టర్ నిహాల్ సరిన్ 11 పాయింట్లతో రన్నరప్గా నిలిచాడు. మరో భారత ఆటగాడు, తెలంగాణకు చెందిన అర్జున్ ఇరిగేశి (Arjun Erigaisi) కి కూడా 11 పాయింట్లే వచ్చినప్పటికీ టైబ్రేక్లో వెనకబడి మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మాజీ ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఎనిమిదో స్థానం పొందాడు. ఇక మహిళల విభాగంలో అమెరికా క్రీడాకారిణి కరిస్సా ఇప్ టైటిల్ దక్కించుకుంది. ఆమెకు భారత క్రీడాకారిణి వంతిక అగర్వాల్ గట్టి పోటీ ఇచ్చింది. అయితే, టైబ్రేక్లో తడబడి రన్నరప్తో సరిపెట్టుకుంది. కోల్కతా వేదికగా టాటా స్టీల్ చెస్ (Tata Steel Chess) టోర్నీ జరిగింది.


