కలం, వెబ్ డెస్క్ : విజయవాడ (Vijayawada)లో కారు బీభత్సం సృష్టించింది. రాజరాజేశ్వరి పేటకు చెందిన ఓ యూట్యూబర్ మద్యం మత్తులో కారుతో భవానీపురం బొబ్బూరి గ్రౌండ్స్ ఎగ్జీబీషన్ ప్రాంగణంలోకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో ముగ్గిరికి గాయాలు కాగా వారిని 108 అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన వారిలో ఓ బాలుడు ఉన్నాడు. ప్రమాదం తరువాత ఆ యూట్యూబర్ వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.


