epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

త్వరలో మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్​ : మోడీ

కలం, వెబ్​ డెస్క్​ : ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా భారతదేశం త్వరలో మారబోతోంది అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఆదివారం గుజరాత్​ రాజ్​కోట్ లో (Rajkot)​ జరిగిన వైబ్రంట్​​​ గుజరాత్​ కాన్ఫరెన్స్ (Vibrant Gujarat Conference) ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయన్నారు. పాల ఉత్పత్తిలో, డిజిటల్​ లావాదేవీల్లో మనమే మొదటి స్థానంలో ఉన్నామని.. భారత్​ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు.

కృషి, పట్టుదలతో ముందుకెళితే విజయం సాధించోచ్చని ప్రధాని సూచించారు. అభివృద్ధితో పాటు వారసత్వాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలో గుజరాత్​ చూపించిందని చెప్పారు. 2026లో తన మొదటి పర్యటన గుజరాత్​ అని.. సోమనాథుడి దర్శించుకోవడంతో ఈ ఏడాది తన పర్యటన ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు పీఎం మోడీ. ప్రధానితో పాటు గుజరాత్​ ముఖ్యమంత్రి భూపేంద్ర పాటిల్​, డిప్యూటీ సీఎం హర్ష్​ సంఘవి కూడా పాల్గొన్నారు.

గుజరాత్​ కాన్ఫరెన్స్ ప్రారంభానికి ముందు ప్రధాని మోడీ గుజరాత్​ ఇండస్ట్రీయల్​ కార్పొరేషన్​ ద్వారా 7 జిల్లాల్లో 3540 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసి కొత్త స్మార్ట్ ఇండస్ట్రీయల్​ ఎస్టేట్​ లను కూడా ప్రారంభించారు. కాగా, వైబ్రంట్​ గుజరాత్​ ప్రాంతీయ సదస్సు.. పశ్చిమ గుజరాత్​ లో పెట్టుబడులు పెట్టడమే లక్ష్యంగా ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో 1800లకు పైగా బిజినెస్ సమావేశాలు, 1500 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటారని అంచనా వేస్తున్నారు.

Vibrant Gujarat Conference
Vibrant Gujarat Conference

Read Also: బంగారం, వెండిపై అధిక లాభాలు రావాలా.. ఇలా చేయండి..!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>