epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మేడారం జాతరకు 700 బస్సులు.. మహిళలకు ఉచిత ప్రయాణం

కలం, కరీంనగర్ బ్యూరో: గిరిజన వనదేవతలు సమ్మక్క, సారలమ్మ జాతర (Medaram)కు తెలంగాణ రోడ్డు రవాణ సంస్థ టీఎస్ ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ నుంచి 700 బస్సులు నడిపించాలని నిర్ణయించింది. గతంలో నడిపించిన సర్వీసుల కంటే ఈ ఏడాది అదనంగా 70 బస్సులను నడిపించాలని నిర్ణయించారు. ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభమయ్యే మేడారం జాతరకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

700 బస్సులను కరీంనగర్ రీజియన్ పరిధిలోని కరీంనగర్, పెద్దపల్లి, మంథని, గోదావరిఖని, హుస్నాబాద్, హుజూరాబాద్ నుంచి మేడారంకు ప్రత్యేకంగా నడిపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 26వ తేదీ నుంచి జాతర కోసం ప్రత్యేక బస్సులు నడిపిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఇప్పటికే కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మేడారం జాతర (Medaram) యాత్రికులకు సైతం వర్తిస్తుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>