epaper
Tuesday, November 18, 2025
epaper

డాక్టర్‌పై పోలీసు అత్యాచారం.. మరొకరు వేధింపులు..

మహారాష్ట్ర(Maharashtra) దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న మహిళా డాక్టర్‌పై ఎస్ఐ గోపాల్ బాద్నే పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ లాడ్‌పుత్రే వేధింపులకు గురి చేశాడు. వీటిని తట్టుకోలేకపోయిన వైద్యురాలు.. ఆత్మహత్యకు పాల్పడింది. మహారాష్ట్ర – సతారా ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న మహిళా డాక్టర్‌పై 5 నెలల్లో 4 సార్లు అత్యాచారానికి పాల్పడిన ఎస్సై గోపాల్‌ బాద్నే. లాడ్‌పుత్రే..ఆమెను తీవ్రంగా వేధించాడు. పోలీసుల వేధింపులపై గతంలో లేఖ రాసినా డీఎస్‌పీ పట్టించుకోలేదు. దీంతో చేసేదేమీ లేక ఆత్మహత్యకు పాల్పడింది.

Maharashtra | సతారా ఆసుపత్రి(Satara Hospital)లో బాధితురాలు రెండేళ్ల క్రితమే విధులకు చేరింది. పోస్టుమార్టం, ఫిట్‌నెస్‌లపై నకిలీ నివేదికలు ఇవ్వాలంటూ డాక్టర్‌ను పోలీసులు తీవ్రంగా వేధించారు. ఉన్నతాధికారులకు లేఖ రాసినా పట్టించుకోకపోవడంతో, చేతిపై రాసి సూసైడ్ చేసుకున్న మహిళా డాక్టర్. ఈ ఘటనపై విచారణ చేపట్టి ఎస్సై గోపాల్‌ బాద్నేను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

Read Also: ‘పెట్ అండ్ ప్లే పార్క్’ పనులను సీఎం తనిఖీ..

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>