epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

కువైట్​లో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష

కలం, వెబ్​డెస్క్​: గల్ఫ్​ దేశం కువైట్​ (Kuwait) లో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష పడింది. భారీ మొత్తంలో డ్రగ్స్​ అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వీళ్లకు అక్కడి న్యాయస్థానం ఈ కఠిన శిక్ష విధించింది. కువైట్​లోని కైఫాన్​, షువైక్​ ఏరియాల్లో నివసించే వీరి నుంచి 1కేజీల హెరాయిన్​, 8కిలోల మెథాంఫెటమైన్​ను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఈ ఇద్దరూ అంతర్జాతీయ మాఫియా ముఠాలో సభ్యులని పోలీసులు గుర్తించారు. అనంతరం వీరిని స్థానిక క్రిమినల్​ కోర్టులో ప్రవేశపెట్టారు. సాక్షాధారాలను పరిశీలించిన అనంతరం జడ్జి ఖలేద్​ అల్​ తహౌస్​ నిందితులకు మరణశిక్ష విధించింది. నిందితులు ఏ రాష్ట్రానికి చెందినవాళ్లో వివరాలు వెల్లడించలేదు. కాగా, గల్ఫ్​ కంట్రీస్​లో మత్తు పదార్థాలు, మద్యం వంటి వాటిపై నిషేధం ఉంటుంది. ఎవరైనా పట్టుబడితో శిక్షలు కఠినంగా ఉంటాయి.

Read Also: రోడ్డెక్కిన నిరుద్యోగులు.. జాబ్ క్యాలెండర్ విడుదలకు డిమాండ్​

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>