కలం, వెబ్ డెస్క్ : హిల్ట్ పాలసీ (HILT Policy) భవిష్యత్ తరాల ఆరోగ్యానికి పునాది అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అసెంబ్లీలో హిల్ట్ పాలసీపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. అభివృద్ధి పేరుతో పర్యావరణ విధ్వంసం ఆగాలన్నారు. మనం భూయజమానులం కాదు.. కేవలం ట్రస్టీలం మాత్రమేనని తెలిపారు. హిల్ట్ పాలసీలో ల్యాండ్ కన్వర్షన్ పై ఎలాంటి బలవంతం లేదు అని, పారిశ్రామికవేత్తలకు ఇష్టం అయితేనే ల్యాండ్ కన్వర్షన్ చేయొచ్చని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని శ్రీధర్ బాబు విమర్శించారు. ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా జూబ్లీహిల్స్ ఎన్నికల్లోనూ.. పంచాయతీ ఎన్నికల్లోనూ గెలిచామని శ్రీధర్ బాబు గుర్తు చేశారు.


