కలం, వెబ్డెస్క్: నిరుడు నవంబర్లో ఢిల్లీలోని ఎర్రకోట వద్ద 15 మందిని బలిగొన్న బాంబు పేలుడు (Delhi bomb blast) వెనక కీలక అంశాలను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA investigation) – ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అధికారులు గుర్తించారు. ఈ కేసులో నిందితులైన డాక్టర్లు.. పాకిస్థాన్లోని టెర్రరిస్ట్ గ్రూప్ సభ్యులతో టచ్లో ఉండడానికి ఘోస్ట్ సిమ్లు, ఎన్క్రిప్టెడ్ మెసేజ్ యాప్లు వాడినట్లు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. ఆత్మాహుతికి పాల్పడిన సూసైడ్ బాంబర్ ఉమర్ నబీతోపాటు మరో ఇద్దరు నిందితులు రెండు, మూడు ఫోన్లు ఉపయోగించినట్లు తెలిపారు. ఇందులో వాళ్ల పేరుతో తీసుకున్న సిమ్లతోపాటు, నకిలీ ఆధార్ కార్డులతో తీసుకున్న సిమ్లు కూడా వాడినట్లు చెప్పారు.
అలాగే ఫోన్లో సిమ్ లేకపోయినా మెసేజ్లు పంపడానికి ఎన్క్రిప్టెడ్ యాప్లు వాడారని వెల్లడించారు. ఘోస్ట్ సిమ్లు అంటే.. అక్రమ లావాదేవీలు, తప్పుడు పనులు చేయడానికి వీలుగా ఇతరుల పేరు, అడ్రస్తో తీసుకునేవే ఘోస్ట్ సిమ్లు. వీటిని ఎక్కువగా సైబర్ నేరగాళ్లు, ఉగ్రవాదులు ఉపయోగిస్తుంటారు. ఈ ఘోస్ట్ సిమ్లు, ఎన్క్రిప్టెడ్ యాప్లు ఉపయోగించిన నిందితులు పాకిస్థాన్ నుంచి వచ్చిన సూచనలు, సలహాలు పాటించి ఢిల్లీ బాంబు పేలుడు (Delhi bomb blast) కు కావాల్సిన ఐఈడీ బాంబులు ఇక్కడే తయారుచేసినట్లు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు.
Read Also: పెండ్లి వేడుకల్లో విషాదం.. సర్పంచ్ను కాల్చి చంపిన దుండగులు
Follow Us On: Youtube


