epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

పదకొండేళ్లుగా ఫస్టియర్​లోనే.. ఎంబీబీఎస్​ విద్యార్థి నిర్వాకం!

కలం, వెబ్​డెస్క్​: ఒకటీ రెండూ కాదు ఏకంగా పదకొండేళ్ల నుంచి ఒకే తరగతిలోనే కొనసాగుతున్నాడా విద్యార్థి (Mbbs student). ఈ షాకింగ్​ ఘటన ఉత్తరప్రదేశ్​లోని గోరఖ్​పూర్​లో ఉన్న బీఆర్​డీ మెడికల్​ కాలేజీలో బయటపడింది. ఇటీవల ఆ కాలేజీకి కొత్త ప్రిన్సిపాల్ వచ్చారు. ఆయనకు హాస్టల్​ వార్డెన్​ ఫిర్యాదు చేయడంతో ఈ ఘనకార్యం బయటికి వచ్చింది. ఇన్నేళ్లుగా ఫస్టియర్​లోనే కొనసాగుతున్న ఆ విద్యార్థి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియక సదరు ప్రిన్సిపాల్​ ఏకంగా నేషనల్​ మెడికల్​ కౌన్సిల్​(ఎన్​ఎంసీ)కి మొరపెట్టుకున్నారు.

అసలు విషయం ఏంటంటే..

సదరు విద్యార్థి (Mbbs student) సొంతూరు ఆజాంగఢ్​. తండ్రి సర్కిల్​ ఇన్​స్పెక్టర్​. ఎంబీబీఎస్​ చదవడం కోసం నిర్వహించే సీపీఎంటీ పరీక్షలో బొటాబొటీ మార్కులతో పాసైన ఆ విద్యార్థి.. 2014లో రిజర్వు కేటగిరీ కింద బీఆర్​డీ కాలేజీలో చేరాడు. అనంతరం ఫస్ట్​ ఇయర్​ పరీక్షలు రాశాడు. అయితే, మొత్తం అన్ని సబ్జెక్టుల్లోనూ ఫెయిల్​ అయ్యాడు. విచిత్రమేంటంటే ఆ తర్వాత అతను మళ్లీ సప్లిమెంటరీ కాదు కదా ఏ పరీక్ష కూడా రాయలేదు. అటెండెన్స్​ మాత్రం ఉంది. అంతేకాదు, హాస్టల్​ వదిలిపెట్టి వెళ్లకుండా, అందులోనే ఉండిపోయాడు. అలా ఏకంగా పదొండేళ్లు పరీక్షలు రాయకుండా, పాసవకుండా గడిపేశాడు.

విద్యార్థి తీరుతో విసుగుచెందిన హాస్టల్​ వార్డెన్​ నాలుగు సార్లు ప్రిన్సిపాల్​కు ఫిర్యాదు చేశారు. అయితే, ఆయన ఎలాంటి చర్యా తీసుకోలేదు. ప్రస్తుతం కొత్త ప్రిన్సిపాల్ రావడంతో వార్డెన్​ మళ్లీ ఫిర్యాదు చేయగా, విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే ఆరుగురు హెచ్​వోడీలు, హాస్టల్​ వార్డెన్​తో మీటింగ్​ ఏర్పాటుచేసిన ప్రిన్సిపాల్​.. విద్యార్థి, అతని తండ్రితో మాట్లాడారు. చివరికి ఆ విద్యార్థికి మరొక అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, ఆ స్టూడెంట్​ శ్రద్ధగా చదివి, పాసవకపోతే ఏం చేయాలి? అనే అనుమానం రావడంతో ఎన్ఎంసీ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు.

ఎన్​ఎంసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

మెడికల్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియా (పాత నిబంధనల) ప్రకారం ఎంబీబీఎస్​ పూర్తి చేయడానికి నిర్ణీత గడువు లేదు. ఎన్నేళ్లలో అయినా కోర్సు పూర్తి చేయొచ్చు. అయితే, నేషనల్​ మెడికల్​ కౌన్సిల్​(ఎన్​ఎంసీ) 2023లో తెచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ఒక విద్యార్థి ఎంబీబీఎస్​ ఫస్టియర్​ను నాలుగు అటెంప్ట్​ల్లోగా పూర్తిచేయాలి. అలాగే మొత్తం కోర్సును తొమ్మిదేళ్ల లోపు పూర్తిచేయాలి. ఈ విద్యార్థి పాత నిబంధనలు అమలులో ఉన్న కాలంలో కాలేజీలో చేరినందువల్ల అతనిపై ఎలాంటి చర్య తీసుకోవాలన్నది ఎన్​ఎంసీ నిర్ణయించాలి.

ఇదే మొదటిది కాదు..

ఎంబీబీఎస్​ విద్యార్థులు ఏళ్ల తరబడి కోర్సు పూర్తి చేయకపోవడం ఇదే మొదటిసారి కాదు. కోర్సు పూర్తికి 10–12 ఏళ్లు సమయం తీసుకున్నవాళ్లు చాలా మందే ఉన్నారు. ఒకరైతే ఏకంగా 22 ఏళ్ల సమయం తీసుకున్నారు. ఇదే ఇప్పటివరకు రికార్డు. అయితే, ఫస్ట్​ ఇయర్​లోనే 11 ఏళ్లు గడిపిన రికార్డు మాత్రం ప్రస్తుతం గోరఖ్​పూర్​ బీఆర్​ఆడీ కాలేజీ విద్యార్థిదే.

Read Also:  ‘నరేగా బచావో’ పై సీతక్క దేశవ్యాప్తంగా ప్రొటెస్ట్.. షెడ్యూల్ ఫిక్స్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>