epaper
Friday, January 16, 2026
spot_img
epaper

ఆ కంటెంట్​, అకౌంట్స్​ తొలగిస్తాం: ఎక్స్​

కలం, వెబ్​డెస్క్​: తమ ఏఐ చాట్​బాట్​ గ్రోక్ (Grok ai controversy)​ లో అసభ్య కంటెంట్​పై ఎలాన్​ మస్క్​ సంస్థ ‘ఎక్స్​’ స్పందించింది. ఆ కంటెంట్​ తొలగిస్తామని, పోస్ట్​ చేసిన అకౌంట్లను శాశ్వతంగా రద్దు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్​’కు చెందిన ‘ఎక్స్​ గ్లోబల్​ గవర్నమెంట్ అఫైర్స్​’ ఖాతా ద్వారా వెల్లడించింది. కాగా, ‘ఎక్స్​’ అనుబంధ గ్రోక్​, ఎక్స్​ఏఐలో మహిళలు, చిన్నపిల్లల ఫొటోలతో అసభ్య కంటెంట్​ క్రియేట్ చేసి, దాన్ని వివిధ సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్స్​లో పోస్ట్ చేసే ట్రెండ్​ ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై మనదేశంలో శివసేన(యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది రెండు రోజుల కిందట కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వీనీ వైష్ణవ్​కు ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్రం రంగంలోకి దిగి ‘ఎక్స్​’ భారత ప్రతినిధికి నోటీసులు జారీ చేసింది. అసభ్య కంటెంట్​ తొలగించాలని, దీనిపై తీసుకున్న చర్యలను 72 గంటల్లోగా ప్రభుత్వానికి నివేదించాలని ఆదేశించింది. ఈ క్రమంలో ‘ఎక్స్​’ స్పందించింది. అంతకుముందు ఎలాన్​ మస్క్​ సైతం ఈ అంశంపై స్పందిస్తూ, గ్రోక్​(Grok ai controversy)​ ను ఉపయోగించి అశ్లీల కంటెంట్​ తయారీకి ప్రాంప్ట్​ ఇచ్చినవాళ్లపై, ఆ కంటెంట్​ను అప్​లోడ్​ చేసినవాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>