epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మందుబాబులా మజాకా.. 3 రోజుల్లో రూ.వెయ్యి కోట్ల లిక్కర్​ తాగేశారు

కలం, వెబ్ డెస్క్​ : నూతన సంవత్సర వేడుకల్లో మందుబాబులు తెగ తాగేశారు. తెలంగాణలో మూడు రోజుల్లోనే మద్యం అమ్మకాలు (Telangana Liquor Sales) విపరీతంగా పెరిగాయి. డిసెంబర్​ 29, 30, 31 తేదీల్లో మొత్తం కలిపి రూ.1000 కోట్లకు పైగా విలువైన మద్యం సేల్ అయ్యాయి. అలాగే, గత ఆరు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం విక్రయాలు మొత్తం రూ.1,350 కోట్లకు చేరాయి. ఈ కొద్ది కాలంలోనే 8.30 లక్షల లిక్కర్​ కేసులు, 7.78 లక్షల బీర్​ కేసులు అమ్ముడైనట్లు అధికారులు వివరించారు.

సాధారణంగానే మద్యం అమ్మకాలు ఒకరేంజ్లో  జరుగుతుంటాయి. లిక్కర్​ సేల్స్​ తో ఒక్కరోజునే కోట్ల ఆదాయం ప్రభుత్వానికి అందుతుంటుంది. ఈ క్రమంలోనే న్యూ ఇయర్​ (New Year Celebrations) జోష్​ లో మందుబాబులు మూడు రోజుల్లోనే తెగతాగేశారు. రాష్ట్ర వ్యాప్తంగా  డిసెంబర్ 29న రూ.280 కోట్లు, డిసెంబర్​ 30న రూ. 380 కోట్లు, డిసెంబర్​ 31 రోజున రూ. 315 కోట్లకు పైగా విలువైన మద్యం అమ్మకాలు (Telangana Liquor Sales) జరిగాయి. 2024 డిసెంబర్​ నెలాఖర్లో రూ. 736 కోట్ల విక్రయాలు జరగ్గా ఈ సారి ఆ రికార్డు బద్దలైంది.

Read Also: అణు కేంద్రాల రక్షణ.. భారత్-పాక్ కీలక ఒప్పందం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>