epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

వాయుసేన​​ ఏవోసీ ఇన్​ చీఫ్​గా సీతేపల్లి శ్రీనివాస్​

కలం, వెబ్​డెస్క్​: భారత వాయుసేన ట్రైనింగ్​ కమాండ్​కు ఎయిర్​ ఆఫీసర్​ కమాండింగ్​ ఇన్​ చీఫ్​(ఏవోసీ–ఇన్​–సి)గా ఎయిర్​ మార్షల్​ సీతేపల్లి శ్రీనివాస్ (Seethepalli Shrinivas)​ నియమితులయ్యారు. ఈ మేరకు ఇండియన్​ ఎయిర్​ ఫోర్స్​ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. అనంతరం ఇదే రోజు పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ బెంగళూరులోని​ ట్రైనింగ్​ కమాండ్​ వార్​ మెమోరియల్​లో అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించారు. నేషనల్​ డిఫెన్స్​ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన ఎయిర్​ మార్షన్​ శ్రీనివాస్​ 1987 జూన్​లో ఐఏఎఫ్​ ఫైటర్​ స్ట్రీమ్​లో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. యుద్ధ విమానాలు నడపడంలో శ్రీనివాస్​ విశేష అనుభవం ఉంది.

వాయుసేనలో మిగ్​–21, ఇస్క్రా, కిరణ్​, పీసీ–7 ఎంకే2, హెచ్​పీటీ–32, మైక్రోలైట్​ ఎయిర్​క్రాఫ్ట్​ తదితర వాటిలో ఆయనకు 4,200 గంటల ఫ్లయింగ్​ అనుభవం ఉంది. అలాగే యుద్ధ విమానాలు నడపడానికి శిక్షణ ఇవ్వడంలో ఎ–కేటగిరీ ట్రైనర్​గా శ్రీనివాస్ ​(Seethepalli Shrinivas)కు గుర్తింపు ఉంది. 2017 విశిష్ట సేవ​, 2024లో ఏటీఐ విశిష్ట సేవ పురస్కారాలను ఆయన పొందారు. ఎయిర్​ మార్షల్​ సీతేపల్లి శ్రీనివాస్​ తెలంగాణకు చెందిన వ్యక్తిగా భావిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ఆయన్ని ఒకసారి పద్మ అవార్డుకు సిఫార్సు చేసింది.

Read Also: తొలి వందే భారత్​ స్లీపర్ ఏ రూట్​లో అంటే..​

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>