epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

భారత మహిళల జట్టు క్లీన్​స్వీప్​

కలం, వెబ్​డెస్క్​: భారత మహిళల జట్టు 2025ను ఘనంగా ముగించింది. శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్​ను క్లీన్​స్వీప్​ చేసింది. మంగళవారం తిరువనంతపురం వేదికగా జరిగిన చివరి టీ20లో 15 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత కెప్టెన్​ హర్మన్​ప్రీత్ (Harmanpreet)​ (68; 43 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్​) మెరవడంతో భారత్​ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఓపెనర్లు షఫాలీ వర్మ(5), కమలిని(12)తోపాటు హర్లీన్​ డియోల్​(13), రిచా ఘోష్​(5), దీప్తి శర్మ(7) స్వల్ప స్కోర్లకే వెనుదిరగ్గా అమన్​జ్యోత్​ కౌర్​(21; 18 బంతుల్లో 1 ఫోర్​, 1 సిక్స్​)తో కలసి ఆరో వికెట్​కు హర్మన్​ ప్రీత్​ 61 పరుగులు జోడించింది. చివర్లో తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి (27 నాటౌట్​; 11 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్​) మెరుపులు మెరిపించింది. శ్రీలంక బౌలర్లలో ఆటపట్టు, రష్మిక, కవిష తలో రెండు వికెట్లు తీయగా, మధుషాని 1 వికెట్​ దక్కించుకుంది.

అనంతరం ఛేదనలో శ్రీలంక ఆదిలోనే కెప్టెన్​ చమరి ఆటపట్టు(2) వికెట్​ కోల్పోయింది. అయితే, ఓపెనర్​ హాసిని పెరీరా(65; 42 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్​), ఇమేషా దులానీ(50; 39 బంతుల్లో 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో గెలుపుపై తమ జట్టుకు ఆశలు రేకెత్తించారు. హాసిని పెరీరా ఆఖరి వరకు పోరాడినప్పటికీ తమ జట్టును గెలిపించలేకపోయింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి , వైష్ణవి శర్మ , శ్రీ చరణి , అమన్​జ్యోత్ కౌర్​, స్నేహ్​ రాణా తలో వికెట్​ పడగొట్టారు. హర్మన్​ప్రీత్​కు ‘ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​’, షఫాలీ వర్మకు ‘ప్లేయర్​ ఆఫ్​ ది సిరీస్​’ దక్కాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>