కలం, వెబ్ డెస్క్ : కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడితో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు ( Ramchander Rao ) భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రామచందర్ రావు మంగళవారం నడ్డాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ సమీకరణలపై ఇరువురు చర్చించారు.
తెలంగాణలో బీజేపీతో పాటు ప్రధాని మోడీపై పెరుగుతున్న ఆదరణ గురించి కేంద్రమంత్రికి రామచందర్ రావు వివరించారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీజేపీ చేపట్టిన కార్యక్రమాలు, తదితర అంశాలపై కూలంకషంగా చర్చించారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, వ్యూహాలపై కేంద్రమంత్రి నడ్డా రామచందర్ రావుకు దిశానిర్దేశం చేశారు.


