epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రేపు బంగ్లాదేశ్​కు జైశంకర్​

కలం, వెబ్​డెస్క్​: భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ (Jaishankar)​ రేపు బంగ్లాదేశ్​కు వెళ్లనున్నారు. బంగ్లాదేశ్​ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్​ నేషనలిస్ట్​ పార్టీ (బీఎన్​ఎపీ) అధ్యక్షురాలు ఖలీదా జియా నేడు (మంగళవారం) మరణించిన సంగతి తెలిసిందే. ఆమె అంత్యక్రియలు రాజధాని ఢాకాలోని జియా ఉద్యాన్​లో జరగనున్నాయి. అక్కడే ఆమె భర్త జియావుర్​ రహమాన్​ సమాధి ఉంది. దాని పక్కనే ఖలీదాను ఖననం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారత్​ తరఫున జైశంకర్​ హాజరవుతారు. ఈ మేరకు భారత విదేశాంగ వెల్లడించింది. కాగా, ఖలీదా జియా 1991–96, 2001‌–06 మధ్య రెండు సార్లు బంగ్లా​ ప్రధానిగా పనిచేశారు. అధికారంలో ఉన్నప్పుడు భారత్​ కంటే ఎక్కువగా చైనాకు సన్నిహితంగా మెలిగారు. షేక్​ హసీనా హయాంలో జైలు జీవితం అనుభవించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మృతి చెందారు. ఆమె మృతికి ప్రధాని మోదీ, బంగ్లా పదవీచ్యుత ప్రధాని షేక్​ హసీనా సంతాపం తెలిపారు. కాగా, కొన్ని రోజుల నుంచి బంగ్లాదేశ్​లో భారత వ్యతిరేక ఆందోళనలు, నిరసనలతోపాటు హిందువులపై దాడులు, హత్యలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఖలీదా జియా అంత్యక్రియలకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ (Jaishankar)​ హాజరవుతుండడం ఈ రెండు దేశాలతోపాటు ప్రపంచం ఆసక్తికరంగా గమనిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>