epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

టోల్ ఫ్రీకి అనుమతి ఇవ్వండి: కేంద్రానికి కోమటిరెడ్డి లేఖ

కలం, వెబ్ డెస్క్: సంక్రాంతి సందర్భంగా ట్రాఫిక్ సమస్య నియంత్రించేందుకే తానే రంగంలోకి దిగుతానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) ప్రకటించారు. బైక్ పై తిరుగుతూ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తానని.. తనతోపాటూ అధికారులు మొత్తం ఆ సమయంలో అందుబాటులో ఉండాలని ఆయన పేర్కొన్నారు. సంక్రాంతి వేళ హైదరబాద్ పరిధిలోని టోల్ గేట్ ల వద్ద విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. నగర ప్రజలు మొత్తం పల్లెబాట పడతారు. దీంతో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది.

ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు నేరుగా మంత్రి కోమటిరెడ్డి రంగంలోకి దిగనున్నారు. సంక్రాంతి పండగ వేళ టోల్ ఫీజులు ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. పండుగకు ముందు మూడు రోజులు, తర్వాత మూడు రోజులు అన్ని విభాగాలు అలెర్ట్ గా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి అధికారులకు సూచించారు. ఆ రోజుల్లో హెవీ వెహికిల్స్ రహదారిపై ప్రయాణం చేయకుండా చూడాలన్నారు. ప్రత్యేక కంట్రోల్ రూం సెంటర్ ఏర్పాటు చేయాలని.. 108అంబులెన్స్‌లు, మెడికల్ టీం‌లు, రెవెన్యూ, పోలీసు, ఆర్అండ్‌బి, ఎన్‌హెచ్‌ఏఐ అలెర్ట్‌గా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి(Komatireddy Venkat Reddy) కోరారు.

కేంద్రానికి లేఖ రాశాం

తాను స్వయంగా మోటార్ సైకిల్ మీద తిరుగుతూ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తానని మంత్రి పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ వేళ టోల్ మినహాయింపు ఇవ్వాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి(Nitin Gadkari) లేఖ రాశానని.. అవసరమైతే స్వయంగా వెళ్ళి కలుస్తానన్నారు. తప్పనిసరి అయితే టోల్ ప్లాజాల వద్ద నామినల్ పేమెంట్ చేయడానికి ఆర్ అండ్ బీ సిద్ధంగా ఉన్నదన్నారు. హైదరాబాద్ – విజయవాడ రహదారి పై గంటల తరబడి ట్రాఫిక్ ఇబ్బందులు(Traffic Problems) లేకుండా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

తూప్రాన్ పేట్,అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో తాను ఫీల్డ్ విజిట్ చేస్తానన్నారు. ఈ సంక్రాంతికి ట్రాఫిక్ ఫ్రీ రోడ్లు లక్ష్యంగా సమష్టిగా పనిచేయాలని సూచించారు. సంక్రాంతి పండుగ సమయంలో నేషనల్ హైవేలపై ముఖ్యంగా హైదరాబాద్ – విజయవాడ రహదారి పై ట్రాఫిక్ రద్దీ నివారణకు చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి డా.బి.ఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సెక్రటేరియట్ లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ‘హైదరాబాద్ – విజయవాడ హైవే పై జనవరి 8 నుండి వాహన రద్దీ ఎక్కువ ఉంటుంది. సంక్రాంతికి వెళ్ళే వారికి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రత్యేక దృష్టి సారించారు. పోయినసారి ఎదురైన అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకోవాలి. రోజుకు సుమారు లక్ష వాహనాల ప్రయాణం సాగుతుంది. దీనిపై అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలి’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు.

ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ ట్రాఫిక్: మంత్రి కోమటిరెడ్డి

‘ఎల్బీనగర్ నుండి వనస్థలిపురం, పనామా గోడౌన్, హయత్ నగర్, రామోజీ ఫిల్మ్ సిటీ ఈ ప్రాంతాల్లో వేలాది వాహనాలు రద్దీ ఏర్పడుతుంది. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ ఆగడానికి వీల్లేదు. పండుగ రద్దీ ఉన్న రోజుల్లో లేన్‌లు మూసే పనులు, భారీ యంత్రాలతో చేసే పనులు చేయొద్దు.అత్యవసరంగా చేయాల్సిన పనులు ట్రాఫిక్ తక్కువగా ఉండే రాత్రి వేళల్లో మాత్రమే చేయాలి. పండుగ మొదలుకానున్న తేదీకి ముందే రోడ్లపై ఉన్న మట్టి, నిర్మాణ సామగ్రి, యంత్రాలు పూర్తిగా తొలగించాలి’ అని తెలిపారు.

‘అన్ని రహదారి లేన్‌లు వాహనాల రాకపోకలకు పూర్తిగా అందుబాటులో ఉంచాలి. రోడ్డు పనులు జరుగుతున్న ప్రతి చోట పగలు, రాత్రి స్పష్టంగా కనిపించే ట్రాఫిక్ బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. హై-విజిబిలిటీ కోన్లు, బారికేడ్లు ఏర్పాటు చేసి పనులు జరిగే ప్రాంతం, ట్రాఫిక్ వెళ్లే దారి స్పష్టంగా చూపాలి. ఎక్కడా ట్రాఫిక్‌కు అయోమయం కలిగించే ఏర్పాట్లు ఉండకూడదు. రద్దీ ఎక్కువగా ఉండే జంక్షన్లు, టోల్ ప్లాజాలు, కీలక ప్రాంతాల్లో అదనపు ట్రాఫిక్ పోలీసులను మోహరించాలి. ట్రాఫిక్ మళ్లింపులు, నియంత్రణ అంశాల్లో స్థానిక ట్రాఫిక్ పోలీసులతో నిరంతరం సమన్వయం పాటించాలి.’ అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు.

Read Also: జోనల్​ కమిషనర్లు ప్రతిరోజు ఫీల్డ్​లో ఉండాల్సిందే : సీఎం రేవంత్​

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>