వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో 22 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ

కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ పోలీస్ కమిషనరేట్ (Warangal Police) పరిధిలో 22 మంది పోలీస్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా అవసరాలు, ఖాళీల భర్తీ తదితర అంశాల ఆధారంగా ఈ బదిలీలు చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీఆర్‌ వరంగల్‌లో పనిచేస్తున్న ఎస్.శ్రీనివాస్‌ను స్టేషన్‌ఘన్‌పూర్ ఎస్‌హెచ్‌ఓగా నియమించారు. అక్కడి ఎస్‌హెచ్‌ఓగా ఉన్న జి.వేణును రఘునాథపల్లి సీఐగా బదిలీ చేశారు. రఘునాథపల్లి సీఐగా ఉన్న ఏ.శ్రీనివాస్‌రెడ్డిని ఖాళీగా ఉన్న సీఎస్‌బీ, వరంగల్‌కు పంపారు. టాస్క్‌ఫోర్స్‌లో ఉన్న పి.దేవేందర్‌కు నర్మెట్ట సర్కిల్ సీఐ బాధ్యతలు అప్పగించారు.

సీపీటీసీలో పనిచేస్తున్న టి.రవి కుమార్‌ను డబ్ల్యూపీఎస్‌-II (వరంగల్, జనగాం) ఎస్‌హెచ్‌ఓగా నియమించారు. ఏ.సువర్ణను సీఎస్‌ఎస్‌, వరంగల్‌కు బదిలీ చేశారు. టాస్క్‌ఫోర్స్‌కు చెందిన పి.మంగీలాల్‌కు టాస్క్‌ఫోర్స్ బాధ్యతలతో పాటు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ అటాచ్మెంట్ ఇచ్చారు. భరత్ సుమన్‌ను పాలకుర్తి సర్కిల్ సీఐగా నియమించగా, వి.జానకి రామ్ రెడ్డిని సీఎస్‌బీ, వరంగల్‌కు బదిలీ చేశారు. పరకాల ఎస్‌హెచ్‌ఓగా ఉన్న వి.క్రాంతి కుమార్‌ను టాస్క్‌ఫోర్స్‌కు పంపారు. పరకాల సీఐగా ఏ ప్రవీణ్ కుమార్ ను నియమించారు. టాస్క్‌ఫోర్స్‌లోని జి.బాబూలాల్‌ను ఆత్మకూర్ ఎస్‌హెచ్‌ఓగా నియమించారు. ఆత్మకూర్ ఎస్‌హెచ్‌ఓ ఆర్.సంతోష్‌కు పర్వతగిరి సర్కిల్ సీఐ బాధ్యతలు అప్పగించారు. పర్వతగిరి సీఐ బి.రాజగోపాల్‌ను టాస్క్‌ఫోర్స్‌కు బదిలీ చేశారు. ఎల్కతుర్తి సీఐ పి.రమేష్‌కు హనుమకొండ డబ్ల్యూపీఎస్‌-I ఎస్‌హెచ్‌ఓగా పోస్టింగ్ ఇచ్చారు. వర్ధన్నపేట సీఐ కే.శ్రీనివాసరావును సీఎస్‌ఆర్‌బీ, వరంగల్‌కు బదిలీ చేశారు. ఆ స్థానంలో వై.సంజీవరావును నియమిస్తూ సంబంధిత అధికారులు వెంటనే బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు.

Also Read : సామాన్యులకు బిగ్ షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>