కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమర శంఖం: నిరసనలకు పువ్వాడ పిలుపు!

కలం, ఖమ్మం బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ సమర శంఖం పూరించింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను వంచిస్తున్న కాంగ్రెస్ పాలనపై సెప్టెంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బృహత్ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ (Puvvada Ajay) ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ​

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1,000 రోజులు గడుస్తున్నప్పటికీ, పాలనలోనూ, హామీల అమలులోనూ పూర్తిగా విఫలమైందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీయడంతో పాటు, ప్రజలను చైతన్యపరిచేందుకు ఈ నిరసనలను ఉధృతం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

​ఈ ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన (Puvvada Ajay) తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో జరిగే ఈ పోరాటంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు.

Also Read : 25వ గ్రాండ్‌స్లామ్ కోసం జకోవిచ్ చివరి పోరాటం!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>