కలం, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనర్సింహా స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవురోజు కావడంతో తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ఆలయ పరిసరాలన్నిభక్తులతో కిటకిటలాడుతున్నాయి. లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి క్యూలైన్లో భక్తులు బారులుతీరారు. స్వామి వారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటలు సమయం పట్టింది. ఆలయానికి భక్తుల రద్దీ తాకిడి నేపథ్యంలో అన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Also Read : తెలంగాణలో 1000 రోజుల పాలనపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
Follow Us On: Youtube

