కలం, వెబ్డెస్క్: నేపాల్ ఆకస్మిక వరదల్లో (Nepal Flood) గల్లంతైన వారి మృతదేహాలు వరద ప్రవాహంలో ఉత్తరప్రదేశ్ వరకు వచ్చాయి. మహారాజ్గంజ్ వద్ద గండక్ నదిలో నేపాల్ నుంచి కొట్టుకువచ్చినట్లు భావిస్తున్న ఏడు మృతదేహాలను గుర్తించారు మహారాజ్గంజ్, కుషినగర్ జిల్లాల నదుల్లో మృతదేహాలు తేలుతూ ఎండటం చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
పోలీసులు మహారాజ్గంజ్ జిల్లా పరిధిలోని నది నుంచి నాలుగు, కుషినగర్ జిల్లా పరిధి నుంచి మూడు మృతదేహాలను వెలికితీశారు. భారత్ సరిహద్దులోని చిత్వాన్ జిల్లాలో అత్యధికంగా 132 మృతదేహాలు లభ్యమయ్యాయి. నేపాల్లో మూడు రోజుల నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా వందలాది మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.

