కలం, వెబ్ డెస్క్ : నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా సైబరాబాద్ పరిధిలో పోలీసులు (Cyberabad Police) ఆంక్షలు విధించారు. 31 రాత్రి 10.30 నుంచి 2 గంటల వరకు అవుటర్ రింగ్ రోడ్డుపై రవాణా వాహనాలను నిషేధించారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసు కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.
ఓఆర్ఆర్ పరిధిలో నిర్మాణ, శిథిలాలను రవాణా చేసే వాహనాలకు అనుమతి లేదని ప్రకటించారు. ఈ ఆంక్షలు కేవలం డిసెంబర్ 31 రాత్రి 10.30 నుంచి 2 గంటల వరకు మాత్రమే ఉంటుందని కమిషనర్ పేర్కొన్నారు.
నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి భద్రత, ట్రాఫిక్ ను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని కమిషనర్ అవినాష్ మోహంతి తెలిపారు. ఈ ఆంక్షలు హైదరాబాద్ శివారు ప్రాంతాలు, ముఖ్యంగా ఐటీ కారిడార్ పై ప్రధానంగా అమలు కానున్నాయి.
Read Also: జెలెన్ స్కీకి పుతిన్ క్రిస్మస్ కానుక…
Follow Us On: Youtube


