కలం, వెబ్ డెస్క్ : ఏపీ క్యాబినెట్ సమావేశం వేళ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Ramprasad Reddy) కన్నీటి పర్యంతమయ్యారు. రాయచోటి నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లా నుంచి వేరు చేయడంపై ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. నేడు జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది. అనంతరం బయటకు వచ్చిన రాంప్రసాద్ రెడ్డి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు.
అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి మార్పును వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ మార్పు వల్ల ప్రజల్లో ఆందోళన నెలకొంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు మంత్రి రాంప్రసాద్ ను ఓదార్చారు. రాయచోటిని మార్చకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను ముఖ్యమంత్రి Ramprasad Reddy కి వివరించారు. నియోజకవర్గం అభివృద్ధిని తానే స్వయంగా చూసుకుంటానని హామీ ఇచ్చారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాలు ఉండగా, కొత్తగా మదనపల్లె, పోలవరం, మార్కాపురం జిల్లాలు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ మార్పుల్లో భాగంగానే అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మరో జిల్లాకు మార్చనున్నారు. మరోవైపు రాయచోటిని మార్చడంపై నియోజకవర్గంలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
🚨 Rayachoti HQ Row
Minister for Transport, Youth Services & Sports Mandipalli Ramprasad Reddy became emotional during the Cabinet discussion on shifting the Annamayya district headquarters to Rayachoti.
CM Chandrababu Naidu consoled him, assured full development, and promised… pic.twitter.com/T7OByzcFSb
— Rathnam News (@RathnamNews) December 29, 2025
Read Also: ఏపీ జిల్లాల పునర్విభజనకు కేబినెట్ ఆమోదం
Follow Us On : WhatsApp


