epaper
Friday, January 16, 2026
spot_img
epaper

టీ న్యూస్​ను నేల మట్టం చేస్తాం : మైనంపల్లి

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో బీఆర్ఎస్​ వర్సెస్​ కాంగ్రెస్​ మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్​ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్​ నేతలు కౌంటర్​​ ఇస్తున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు (Mynampally) కూడా కేటీఆర్​ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. సోషల్​ మీడియాను అడ్డుపెట్టుకుని దష్ప్రచారం చేస్తే సహించబోమని.. టీ న్యూస్​ ఛానెల్​ ను నేల మట్టం చేస్తామని మైనంపల్లి హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీఆర్​ఎస్​ పార్టీ వాళ్లు పదుల సంఖ్యలో ఓ న్యూస్ ఛానల్​​ మీద దాడిచేశారని.. కానీ, తాము మాత్రం లక్షల మందితో కలిసివచ్చి టీ న్యూస్​ ను నేలమట్టం చేస్తామని మైనంపల్లి హెచ్చరించారు. ఏదిపడితే అది ఇష్టారాజ్యంగా రాస్తూ మీడియా పరువు తీస్తున్నారని విమర్శించారు. కేసీఆర్​ కుటుంబం భాషను భ్రష్టు పట్టించిందని ఆయన విమర్శించారు. తండ్రి పేరు చెప్పుకుని కేటీఆర్ పదవులు దక్కించుకున్నాడని.. కానీ రేవంత్​ రెడ్డి (Revanth Reddy) స్వయం కృషితో అంచలంచెలుగా ఎదిగి ప్రజల ఆశీర్వాదంతో సీఎం అయ్యారని తెలిపారు. షార్ట్ కట్ లో గద్దెనెక్కిన కేటీఆర్​ కు ఏం తెలుసు అని ప్రశ్నించారు.

బీఆర్​ఎస్​ కు ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు రాకుండా ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా.. పంచాయతీ ఎన్నికల్లో దెబ్బ తగిలిన కేటీఆర్​ కు బుద్ధి రావడం లేదని మండిపడ్డారు. గతంలో బీఆర్​ఎస్​ ఇచ్చిన హామీలు పూర్తి చేసిందా అని ప్రశ్నించారు. పదేళ్ల కాలంలో సొంత ఫ్లైట్ లు కొనుక్కున్నారని, లక్షల కోట్లు సంపాదించారని మైనంపల్లి ఆరోపించారు. ఈ అవినీతి సొమ్ముపై విచారణ జరిపించాలని సీఎం రేవంత్​ రెడ్డిని ఆయన కోరారు. బీఆర్ఎస్​ నాయకులు అక్రమంగా కట్టిన ఇండ్లను హైడ్రా ద్వారా కూలగొట్టించాలని మైనంపల్లి (Mynampally) విజ్ఞప్తి చేశారు.

Read Also: నక్సలైట్లను ఎన్కౌంటర్ చేయడం కరెక్ట్ కాదు : ప్రకాష్ రాజ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>