కలం, వెబ్డెస్క్: నేడు స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ బీజేపీ (Telangana BJP) అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఓ ఏఐ వీడియో వైరల్గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కలిసి బైక్పై తిరుగుతున్నట్లు, కారెక్కి సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటున్నట్లు ఇందులో ఏఐలో వీడియో క్రియేట్ చేశారు.
ఈ పోస్టుకు బీజేపీ ఆసక్తికర క్యాప్షన్ను జోడించింది. హైడ్రా ఓవైసీకి చెందిన ఫాతీమా కాలేజీపై చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ మొదటి నుంచి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పక్షపాత ధోరణితోనే ఈ పరిస్థితి ఏర్పడింది, బీఆర్ఎస్ కూడా దీన్ని ప్రశ్నించదని బీజేపీ చెప్తోంది. మూసీ ముంపులో ఉన్న ఫాతీమా కాలేజీకి సీఎం రేవంత్ రెడ్డి పహారా కాస్తున్నాడని, అక్రమ పునాదులపై వీరిద్దరి బంధం బలపడిందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ వీడియోలో సైతం ఫాతీమా కాలేజీ వద్ద ముంపులో రేవంత్ రెడ్డి, అసదుద్దీన్ సరదాగా మాట్లాడుకుంటున్నట్లు చూపించారు.
తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న రేవంతుద్దీన్ – ఓవైసీ మిత్ర ద్వయానికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. మరో పోస్టులో కలకాలం కలిసి కుట్రలు చేసే విడదీయలేని మైత్రి బంధానికి స్నేహితుల దినోత్సవం అంటూ కేటీఆర్, కేసీఆర్ రేవంత్ రెడ్డి, ఓవైసీల ఏఐ వీడియో పోస్ట్ చేశారు. మరోవైపు నెటిజన్లు దీనికి పలు రకాలుగా స్పందిస్తున్నారు. బీజేపీ (Telangana BJP) నేతలు ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ఉన్న ఫోటోలు వీడియోలను కామెంట్లలో పెడుతూ విమర్శిస్తున్నారు.
Also Read : కార్పొరేషన్ల భర్తీకి కసరత్తు.. రేసులో గెలిచేదెవరు?
Follow Us On : WhatsApp

