‘నిరాహార దీక్ష విరమిస్తా.. కానీ’ : కేంద్రానికి సోనమ్​ వాంగ్​చుక్​ లేఖ

కలం, వెబ్​ డెస్క్ : నీట్​ లీకేజీపై గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్​ మంతర్​ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్​ వాంగ్​ చుక్ (Sonam Wangchuk) కేంద్రానికి లేఖ రాశారు. దీక్ష విరమించాలని వివిధ పార్టీల నేతలు, పలువురు తన దీక్ష విరమించాలని కోరినట్లు చెప్పారు. ఈ మేరకు నిరాహార దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, దీక్ష విరమించేందుకు సిద్దంగా ఉన్నానని కానీ కేంద్రం తన డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. హామీ ఇస్తే దీక్ష విరమించేందుకు సిద్ధంగా ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు.

షరతులు ఇవే..

నీట్​ పేపర్​ లీకేజీ వివాదంలో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ రాజీనామాను పరిగణలోకి తీసుకోవాలి. ఢిల్లీలో ఆందోళన నిర్వహించిన విద్యార్థులపై లాఠీ ఛార్జ్​ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. జవాబుదారితనాన్ని నిర్ధారించడానికి పార్లమెంట్​ లో చర్చ జరగాలి ఈ ప్రధాన షరతులతో కూడిన లేఖను వాంగ్​ చుక్​ కేంద్రానికి పంపించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>