కలం, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వర్ణగిరి (Swarnagiri) దేవస్థానంలో పూరీ జగన్నాథుని రథయాత్ర మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీ గురువారం సాయంత్రం 4 గంటలకు ఈ రథయాత్రను వైభవంగా నిర్వహించనున్నారు.
ఈ ఆధ్యాత్మిక వేడుకకు సంబంధించి ఆలయ అధికారులు, నిర్వాహకులు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ రథయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, స్వామివారిని దర్శించుకుని కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు కోరారు.
Read Also: తెలంగాణలో పవర్ కట్ అనేదే లేదు.. డిప్యూటీ సీఎం భట్టి
Follow Us On : WhatsApp

