కలం, స్పోర్ట్స్ : ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup) టైటిల్ను వరుసగా రెండోసారి నిలబెట్టుకోవాలనుకున్న అర్జెంటీనా ఆశలు నెరవేరలేదు. ఫైనల్లో స్పెయిన్ చేతిలో అదనపు సమయంలో ఓటమి పాలైనప్పటికీ, స్వదేశం చేరుకున్న తమ హీరోలకు అర్జెంటీనా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. విమానాశ్రయంలో దిగిన ఆటగాళ్లకు రెడ్ కార్పెట్ పరిచి, సైనిక బ్యాండ్ మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఎజైజాలోని మినిస్ట్రో పిస్టారిని అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల ఉన్న అర్జెంటీనా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యాలయం వద్ద వేలాది మంది అభిమానులు గుమిగూడారు.
కోచ్ లయోనెల్ స్కలోని నేతృత్వంలో వచ్చిన ప్రతినిధి బృందానికి సైనిక రెజిమెంట్ ‘ముచాచోస్’ ట్యూన్తో స్వాగతం పలికింది. జట్టు కెప్టెన్ లయోనెల్ మెస్సీ జెర్సీలు ధరించిన అభిమానులు, జాతీయ జెండాలు చేతబూని వీధుల్లో సంబరాలు చేసుకున్నారు. అయితే, 39 ఏళ్ల మెస్సీ ఈ బృందంతో కలిసి స్వదేశానికి రాలేదు. రాబోయే మేజర్ లీగ్ సాకర్ సీజన్ కోసం మానసిక, శారీరక విశ్రాంతి అవసరం కావడంతో ఆయన అమెరికాలోనే ఉండిపోయినట్లు తెలుస్తోంది. జులై 22న చికాగో ఫైర్ ఎఫ్సితో, జులై 25న మోంట్రియల్తో జరిగే లీగ్ మ్యాచ్లకు మెస్సీతో పాటు రోడ్రిగో డి పాల్ దూరమయ్యే అవకాశం ఉంది.
ఎమిలియానో మార్టినెజ్, నికోలస్ ఒటమెండి, లిసాండ్రో మార్టినెజ్, అలెక్సిస్ మెక్ అల్లిస్టర్ వంటి ప్రముఖ ఆటగాళ్లు ఈ బృందంలో ఉన్నారు. విమానాశ్రయం నుంచి కడిగిన రక్షణ మధ్య ఓపెన్ టాప్ బస్సులో ఆటగాళ్లు ‘లయోనెల్ ఆండ్రెస్ మెస్సీ’ గ్రౌండ్స్కు బయలుదేరారు. మార్గమధ్యంలో వేచి ఉన్న వందలాది కుటుంబాలు, అభిమానులు డ్రమ్ములు వాయిస్తూ జట్టుకు తమ మద్దతు తెలిపారు. అర్జెంటీనా ఫుట్బాల్ అసోసియేషన్ శిక్షణా కేంద్రానికి చేరుకున్న తర్వాత ఈ స్వాగత కార్యక్రమం అధికారికంగా ముగిసింది.

