కలం, వెబ్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా షాబాద్ ఘటన (Shabad Crime Case) కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. షాబాద్ ఉన్మాది రాజ్ కుమార్ కిరాతక చర్యపై శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చేవెళ్ల నియోజకవర్గంలో బాధితుల కుటుంబాలను పరామర్శించి, మృతుల చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ ఘటనపై స్పందిస్తూ, సీఐ, ఎస్ఐలను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. కలెక్టర్ నారాయణ రెడ్డి బాధిత కుటుంబంలోని దివ్యాంగురాలు మేఘనకు రూ.5 లక్షల పరిహారం, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత వైద్యం, పునరావాసం కల్పిస్తామని ప్రకటించారు.

