epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మరో 11 మంది ఐఏఎస్​ లకు పదోన్నతులు

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణలో పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఐఏఎస్​ (IAS Officers) లకు పదోన్నతులు కల్పించింది. 2013 బ్యాచ్​ కు చెందిన 11 మంది ఐఏఎస్​ అధికారులకు అడిషనల్​ సెక్రటరీ హోదాతో ప్రమోషన్​ లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శశాంక్​, అద్వైత్​ సింగ్​, శ్రీజన, శృతి ఓజా, వినయ్​, శివలింగయ్య, వాసం వెంకటేశ్వర్​, హన్మంతరావు, ఎం.హరిత, హైమావతి, కే.హరిత పదోన్నతి పొందిన వారిలో ఉన్నారు.

ఈ ప్రమోషన్లు ఇండియన్​ అడ్మినిస్ట్రేటివ్​ సర్వీస్​ నిబంధనల ప్రకారం అమలులోకి వచ్చాయి. అనుభవం కలిగిన అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా పాలనలో వేగం, సమర్థత పెరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ప్రమోషన్​ పొందిన అధికారులకు త్వరలోనే కొత్త శాఖలు, బాధ్యతలు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>