కలం, వెబ్ డెస్క్ : కేరళ రాష్ట్రంలోని వయనాడ్ (Wayanad) లో ఘోర విషాదం చోటు చేసుకుంది. కల్లాడి టన్నెల్ స్థలంలో కొండ చరియలు ఒక్కసారిగా జారిపడ్డాయి. కొండచరియలు విరిగిపడడంతో ఇద్దరు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ప్రమాద ఘటన విషయాన్ని తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలానికి వెళ్లి సహాయక చర్యలు ప్రారంభించాయి. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Read Also: ఇండోనేషియాతో భారత్కు ప్రత్యేక బంధం: ప్రధాని మోదీ
Follow Us On: Instagram

