epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

పల్లె వెలుగులోనూ ఏసీ బస్సులు

కలం, వెబ్ డెస్క్​ : ప్రజలకు నాణ్యమైన, పర్యావరణహిత రవాణా అందించడమే లక్ష్యంగా పల్లె వెలుగు సేవల్లోనూ ఏసీ ఎలక్ట్రిక్​ బస్సులనే(AC Electric Buses) నడపాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) స్పష్టం చేశారు. మంగళవారం ఏపీఎస్​ఆర్టీసీ పై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది 1,450 కొత్త ఎలక్ట్రిక్​ బస్సులు కొనుగోలు చేయాలని సూచించారు. అలాగే, కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరో 1,050 ఎలక్ట్రిక్ బస్సులు అందనున్నాయి తెలిపారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి ఉభయ జిల్లాలో ఈవీ చార్జీంగ్​ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

రాబోయే ఐదేళ్లలో 8,819 డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్​ బస్సులు పెట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు లక్ష్యం నిర్దేశించారు. 8 ఏళ్లకు పైగా కాలపరిమితి పూర్తైన బస్సులను దశలవారీగా ఈవీలుగా మార్చాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్యలతో ఇంధన ఖర్చు తగ్గడం, కాలుష్యం నియంత్రణ, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందడం సాధ్యమవుతుందని సీఎం వెల్లడించారు. ఏపీఎస్​ఆర్టీఎస్​ ను ఆధునికీకరణ దిశగా ముందుకు తీసుకెళ్లడంలో ఈవీ కీలక మార్పు అని చంద్రబాబు(Chandrababu) పేర్కొన్నారు.

Read Also: గోవిందరాజ ఆలయ బంగారం గోల్‌మాల్‌పై టీటీడీ క్లారిటీ

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>