epaper
Monday, March 2, 2026
epaper

తెలంగాణ స్థానిక ఎన్నికలకు బ్రేక్

కలం డెస్క్ : గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో (నెం.9)పై హైకోర్టు(TG High Court) మధ్యంతర స్టే ఇచ్చింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కౌంటర్ అఫిడవిట్ పై పిటిషనర్లు రెండు వారాల్లో రీజాయిండర్ (అభ్యంతరాలు/స్పందన) తెలియజేయాలని ఆదేశించింది. ఆరు వారాల వరకు ఎన్నికల నిర్వహణ నిలిచిపోయింది. రెండు రోజుల పాటు సుదీర్ఘ వాదనల అనంతరం హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీచేసింది. ఈ పరిణామాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ కూడా ఆగిపోయినట్లయింది.

స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో జారీ అయిన నోటీసుల అమలు కూడా ఆగిపోయింది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, జారీ చేసిన జీవో అమలు హైకోర్టు(TG High Court) ఆదేశాలతో అర్ధాంతరంగా ఆగిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా?.. లేక పార్టీపరంగా రిజర్వేషన్లు అమలు చేసేలా నిర్ణయం తీసుకుంటుందా?.. అనేది ఆసక్తికరంగా మారింది.

Read Also: రాత్రికి అభ్యర్థుల జాబితా రెడీ చేయండి: రేవంత్

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!