కలం, వెబ్ డెస్క్ : యాక్టర్ శివాజీ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ (Telangana Women Commission) సీరియస్ అయింది. హీరోయిన్ల దుస్తులపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మహిళ కమిషన్ చైర్ పర్సన్ నేరేళ్ల శారద స్పందించారు. శివాజీ వ్యాఖ్యలను కమిషన్ లీగల్ టీమ్ పరిశీలిస్తుందని చెప్పారు. హీరోయిన్లను కించపరుస్తూ మాట్లాడిన శివాజీపై తప్పకుండా చర్యలు తీసుకుంటామాని మహిళ కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద తెలిపారు. కాగా, శివాజీ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపాయి. పలువురు నటులు, నెటిజన్లను శివాజీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. సింగర్ చిన్మయి, యాంకర్ అనసూయ, మంచు మనోజ్ తో పాటు పలువురు శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన విషయం తెలిసిందే.


