కలం, మెదక్ బ్యూరో : మెదక్ (Medak ) జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శంకరంపేట్ మండలం దరిపల్లి గ్రామంలో పిడుగుపడి వెల్దుర్తి గ్రామానికి చెందిన పనిగంటి మైసయ్య (55) మృతి చెందారు. వ్యవసాయ పొలంలో బోరు బావి మరమ్మతులు చేస్తుండగా వర్షం రావడం తో అతను తలదాచుకోవడానికి చెట్టుక్రిందకు వెళ్లారు. ఈ క్రమంలోనే చెట్టుపై పిడుగుపడి మైసయ్య అక్కడికక్కడే మృతి చెందారు.
Read Also: చేస్తే చాలదు.. చెప్పాలి.. ప్రచారంపై సీఎం ఫోకస్
Follow Us On: Sharechat

