కలం, వరంగల్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ (Hanumakonda) కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ (SFI Protest) ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఫీజు నియంత్ర చట్టం అమలులోకి తీసుకురావాలని, ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

