epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

తుది మెట్టుపై యువ భారత్ బోల్తా: అండర్–19 విజేత పాక్

కలం, వెబ్​డెస్క్​: అండర్​–19 ఆసియా కప్ (Under19 Asia Cup) తుదిపోరులో యువ భారత్​ బోల్తా కొట్టింది. ఆదివారం దుబాయ్​ వేదికగా దాయాది దేశంతో జరిగిన మ్యాచ్ (India Vs Pakistan)​లో ఘోర ఓటమి మూటగట్టుకుంది. ఈ మ్యాచ్​లో టాస్​ ఓడి తొలుత బ్యాటింగ్​కు దిగిన పాకిస్థాన్​ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ జట్టు ఓపెనర్​ సమీర్​​ మన్హాస్(172; 113 బంతుల్లో 17 ఫోర్లు, 9 సిక్స్​లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్స్​లతో విరుచుకుపడ్డాడు. మూడో వికెట్​కు ఉస్మాన్​ఖాన్​(35)తో కలసి 137 పరుగులు, నాలుగో వికెట్​కు ​అహ్మద్​ హుస్సేన్​(56)తో కలసి 62 పరుగులు జోడించి అవుటయ్యాడు. భారత బౌలర్లలో దీపేశ్​ దేవేంద్రన్​ 3 వికెట్లు తీయగా, హెనిల్​ పటేల్​, ఖిలాన్​ పటేల్​ చెరో రెండు వికెట్లు, కనిష్క్​ చౌహాన్​ 1 వికెట్​ పడగొట్టారు.

అనంతరం ఛేదన ప్రారంభించిన భారత్​కు తొలి ఓవర్​లో వైభవ్​ సూర్యవంశీ (26; 10 బంతుల్లో 1 ఫోర్​, 3 సిక్స్​లు) రెండు సిక్స్​లు, 1 ఫోర్​ బాది అదిరే ఆరంభం ఇచ్చాడు. అయితే, మూడో ఓవర్లో కెప్టెన్​ ఆయుష్​ మాత్రె(2) అవుట్​ కావడంతో భారత్​ వికెట్ల పతనం ప్రారంభమైంది. వచ్చినవాళ్లు వచ్చినట్లే వెనుదిరిగారు. దీపేశ్​ దేవేంద్రన్​ (36;16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్​లు​) టాప్​ స్కోరర్​. ఆరోన్​ జార్జ్​(16), అభిజ్ఙాన్​ కుందు(13), ఖిలాన్​ పటేల్​(19) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. చివరికి యువ భారత్​ 26.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌట్​ అయ్యింది. పాక్​ బౌలర్లలో అలీ రజా 3, సయ్యామ్​, అబ్దుల్​ సుభాన్​, ఆషాన్​ తలో 2 వికెట్లు పడగొట్టారు. కాగా, ఆయుష్​, వైభవ్​ అవుటైనప్పుడు పాక్​ ఆటగాళ్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీంతో కాసేపు మైదానంలో ఉద్రిక్తత కనిపించింది. సమీర్​ మిన్హాస్​​ ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​ గా ఎంపికయ్యాడు. కాగా, ఇప్పటివరకు 12 సార్లు టోర్నీ (Under19 Asia Cup) జరగ్గా భారత్​ 7సార్లు, బంగ్లాదేశ్​, పాకిస్థాన్​ రెండుసార్లు, ఆఫ్ఘనిస్థాన్ ఒకసారి కప్​ గెలిచాయి.

Read Also: ‘మ‌హాల‌క్ష్మి’ వ‌ల్లే ఆర్టీసీ లాభాల్లోకి.. డిప్యూటీ సీఎం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>