కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో గంజాయిని తరలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటకలోని బీదర్ నుండి నారాయణఖేడ్ పట్టణంలోని వాసర్కు 30 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా.. ఎక్సైజ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.
ఈ దాడిలో పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ.15 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. నిందితులు శేరి తండాకు చెందిన చౌహన్ ప్రభు, మున్నా నాయక్ తండాకు చెందిన పార్ లాల్ రాథోడ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

