జడ్చర్లలో 2,700 లీటర్ల డీజిల్ సీజ్..!

క‌లం, వెబ్ డెస్క్‌: రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌కు ఉన్న డిమాండ్‌తో కొంద‌రు వ్య‌క్తులు ఇంధ‌నం అక్ర‌మ నిల్వ‌ల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా జ‌డ్చ‌ర్ల‌ (Jadcherla)లో ఇలాగే భారీ ఎత్తున నిల్వ చేసిన డీజిల్‌ (Diesel)ను అధికారులు సీజ్ చేశారు. జ‌డ్చ‌ర్ల‌లోని నాగ‌సాల బంకులో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. జిల్లాలో బంకుల్లో సివిల్ స‌ప్లై అధికారులు త‌నిఖీలు చేప‌ట్టారు. నాగ‌సాల‌లోని ప్ర‌కాశ్ ఫిల్లింగ్ స్టేష‌న్‌లో 2,700 లీట‌ర్ల డీజిల్‌ను బంకు య‌జ‌మాని డ్ర‌మ్ముల్లో నిల్వ చేసుకున్నాడు. ఎలాంటి ర‌క్ష‌ణ లేకుండా కేవ‌లం ఓ గుడ్డ క‌ప్పి సింటెక్స్ ట్యాంక్‌, డ్ర‌మ్ముల్లో వాటిని అలాగే వ‌దిలేశాడు. ఈ బంకుకు స‌మీపంలో ఇటుక బ‌ట్టీలు ఉన్నాయ‌ని, ప‌క్క‌నే ఓ పాఠ‌శాల కూడా ఉంద‌ని, ఏదైనా ప్ర‌మాదం జ‌రిగితే ఎలా అని అధికారులు ప్ర‌శ్నించారు. బంక్ య‌జ‌మానిపై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>