కలం, వెబ్ డెస్క్: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan), సినీ హీరోలు సూర్య (Suriya), కార్తీ (Karthi) చెన్నైలో కలుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చెన్నై (Chennai)లో జగన్ సోదరుడు సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుక జరుగుతోంది. ఈ సందర్భంగా జగన్ శనివారమే చెన్నైకి బయలుదేరి వెళ్లారు. ఈ పెళ్లి వేడుకకు హీరోలు సూర్య, కార్తీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ జగన్ను ఆప్యాయంగా పలకరించారు. వీరు కలిసి మాట్లాడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వివాహ వేడుకకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా హాజరయ్యారు.
Read Also: కిడ్నాప్ కేసు.. మంచు విష్ణుకు నోటీసులు
Follow Us On: Sharechat


