చెన్నైలో క‌లుసుకున్న హీరో సూర్య, జ‌గ‌న్‌.. ఎందుకంటే..?

క‌లం, వెబ్ డెస్క్‌: ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ (YS Jagan), సినీ హీరోలు సూర్య‌ (Suriya), కార్తీ (Karthi) చెన్నైలో క‌లుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. చెన్నై (Chennai)లో జ‌గ‌న్ సోద‌రుడు సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుక జ‌రుగుతోంది. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ శ‌నివార‌మే చెన్నైకి బ‌య‌లుదేరి వెళ్లారు. ఈ పెళ్లి వేడుక‌కు హీరోలు సూర్య‌, కార్తీ కూడా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రూ జ‌గ‌న్‌ను ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు. వీరు క‌లిసి మాట్లాడుకుంటున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వివాహ వేడుకకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా హాజరయ్యారు.

Read Also: కిడ్నాప్​ కేసు.. మంచు విష్ణుకు నోటీసులు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>