కలం, యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డితో కలిసి ప్రజల నుంచి 67 దరఖాస్తులు స్వీకరించారు. అందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 46 దరఖాస్తులున్నాయి. దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పెండింగ్ లేకుండా ఎప్పటికపుడు పరిష్కరించాలని చేయాలని ఆదేశించారు. డీఆర్వో జయమ్మ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కృతిక, జడ్పీ సీఈఓ శోభా రాణి, జిల్లా గ్రామీణా అభివృద్ధి అధికారి నాగిరెడ్డి పాల్గొన్నారు.

