epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

వరంగల్ బల్దియా ముందు ఖాళీ బిందెలతో మహిళల ధర్నా

కలం, వెబ్ డెస్క్ : తాగు నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ మహిళలు వరంగల్ (Warangal) బల్దియా  ముందు ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. గత రెండు సంవత్సరాలుగా నీళ్లు రావడం లేదని లక్ష్మీపురం వాసులు ఆవేదన చెందారు. ఇప్పటివరకు మిషన్ భగీరథ (Mission Bhagiratha) పైపులైను కూడా వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న వాటర్ ట్యాంకులు కూడా కూల్చివేశారని ఆందోళన చెందారు.

ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు మా గోడు పట్టించుకోవాలని వేడుకున్నారు. నీటి సరఫరా సమస్యల వల్ల ప్రజలకు తాగునీరు అందకపోవడం, సరైన సౌకర్యాలు లేకపోవడం వంటి కారణాలతో అధికారులు స్పందించడం లేదని ఆరోపిస్తూ, ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతూ, సమస్యల  పరిష్కారం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇది నీటి కొరత సమస్యకు ఒక సాధారణ నిరసన రూపం.

Read Also: బాబోయ్‌.. యూరియా క్యూలో మందు బాటిల్

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>