కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ (Hyderabad)లోని బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. దేవుడికి దీపం వెలిగిస్తుండగా అగ్నిప్రమాదం జరిగి మహిళ సజీవ దహనమైంది. ఇంట్లో దేవుడికి దీపం వెలిగిస్తుండగా చీర కొంగుకు అంటుకుని మంటలు వ్యాపించాయి. తీవ్ర బయాందోళనకు గురైన సదరు మహిళా బెడ్ రూమ్ లోకి వెళ్లగా మంటలు దుప్పటికి అంటుకొని ఇళ్లంతా వ్యాపించాయి. మంటలు ఉదృతం కావడంతో మహిళా కాలిపోయి చనిపోయింది. మృతురాలు పాఠశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ విజయలక్ష్మిగా గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Read Also: ‘సారీ చెప్పండి’.. వైఎస్.భారతీ రెడ్డి డిమాండ్!
Follow Us On : WhatsApp

