కలం, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సువేందు అధికారి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలకు భోజనం, మద్యం దుకాణాలపై నియంత్రణకు సంబంధించి కొత్త కార్యక్రమాలను ప్రకటించారు. బెంగాల్ ప్రజలకు రూ.5 కే చేపల భోజనం, అన్నపూర్ణ యోజన లాంటి కొత్త పథకాలను ప్రవేశపెట్టారు.
అన్నపూర్ణ యోజన ద్వారా మహిళలకు రూ.3000 అందిస్తామని వెల్లడించారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రార్థనా స్థలాలకు కిలోమీటర్ పరిధిలో మద్యం దుకాణాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. సుమారు 400 ప్రత్యేక క్యాంటీన్లలో వారానికి రెండుసార్లు రూ.5 కే ఫిష్ మీల్స్ పెడుతుందని సువేందు అధికారి తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యేక ఆయూష్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు.

